కరీంనగర్ సీపీ ని కలసిన టీడబ్ల్యూజెఎఫ్ నాయకులు

0

కరీంనగర్ సీపీ ని కలసిన టీడబ్ల్యూజెఎఫ్ నాయకులు
కరీంనగర్:
కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన గౌస్‌ ఆలం ను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజెఎఫ్) జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు ఆధ్వర్యంలో నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీకి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ కమిషనర్ ను కలసిన వారిలో రాష్ట్ర కమిటీ సభ్యుడు గాదె కరుణాకర్ రావు, జిల్లా సహాయ కార్యదర్శి జి. కిరణ్, నాయకులు ఎల్ సురేష్ లు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *