తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం దురదృష్టకరం: ఎమ్మెల్సీ కవిత
![](https://navatelanganabapurao.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-05-at-4.08.08-PM-944x1024.jpeg)
హైదరాబాద్:
తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం దురదృష్టకరమని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల అన్నారు. మంగళవారం ఆమె కామా రెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజ కవర్గంలోని తిప్పారం గ్రామంలో పర్యటించారు. ఆ గ్రామానికి చెందిన హర్యల వెంకట్ బోధన్ హాస్టల్ లో మృతి చెందడం పట్ల ఆమె తన బాధను వ్యక్తం చేశారు. హాస్టల్ వార్డెన్, వాచ్ మెన్ లేకపోవడం ఒకరు చనిపోవడం ఎనిమిది మంది విద్యార్థులపై మర్డర్ కేసు నమోదైందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కారణంగా ఎనిమిది మంది విద్యార్థుల భవి ష్యత్తు నాశనం కావడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వ మని ధ్వజమె త్తారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థత, పట్టింపులేని చర్యల వల్లనే ఈ ఘటన జరిగిందని కవిత విమర్శించారు.
మాజీ సీఎం కేసీఅర్ పై పడి ఏడ్చుడే తప్ప..ఈ మూడు నెలల్లో ప్రజలకు చేసిందేమీ లేదు అని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు విద్య శాఖకు మంత్రి లేక పోవడం దురదృష్టం అని కవిత ఫైర్ అయ్యారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా రివ్యూ నిర్వహించి పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రేవంత్ ప్రభుత్వాన్ని ఆమె కోరారు.