కెసిఆర్ ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
కెసిఆర్ ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్:
యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం పరామర్శించారు. హైదరాబాద్లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రికి వెళ్లిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. కాగా, తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అనంతరం కేసీఆర్ కోలుకుంటున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రవీణ్రావు మాట్లాడుతూ.. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నదని చెప్పారు. చాలా వేగంగానే రికవరీ అవుతున్నారని అన్నారు. ఆర్థోపెడిక్, ఫిజియోథెరపీ వైద్యుల పర్యవేక్షనలో వాకర్ సాయంతో నడిపించే ప్రయత్నం చేయగా, ఆయన శరీరం బాగా స్పందించిందని తెలిపారు. బెడ్ బయటకు వచ్చి కూర్చున్నారని వెల్లడించారు. సాధారణంగా తుంటి కీలు మార్పిడి జరిగిన పేషెంట్ను 12 గంటల్లోపు నడిపించే ప్రయత్నం చేస్తామని, దీన్ని మెడికల్ పరిభాషలో మొబిలైజేషన్ స్టార్ట్’ అంటారని వివరించారు. కేసీఆర్కు ఆపరేషన్ నొప్పి తగ్గి, సాధారణ నొప్పి మాత్రమే ఉన్నదని, ఆయన శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నారని తెలిపారు. సాధారణ ఆహారమే తీసుకుంటు న్నారని పేర్కొన్నారు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు కూడా చేయిస్తున్నామని చెప్పారు. మరికొన్ని రోజులు ఫిజి యోథెరపీ కొనసాగించాల్సి ఉంటుందని అన్నారు. శరీరం సహకరిస్తే మరో రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని తెలిపారు. కెసిఆర్ కు కనీసం 6-8 వారాలపాటు విశ్రాంతి అవసరం ఉంటుందని వివరించారు.
కేసీఆర్ ను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్..
యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Good
Thankyou