కరీంనగర్ కు వినోద్ కుమార్ చేసింది శూన్యం…

2

10 ఏళ్లలో బీఆర్ఎస్ అరాచక పాలన…
. బోయినిపల్లిలో లూటీ చేసిన కుటుంబం పరారీలో ఉంది
. కరీంనగర్ కు వినోద్ కుమార్ చేసింది శూన్యం…
. కేసీఆర్ అనే నాణేనికి కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు బొమ్మ, బొరుసులాంటోళ్లు
. బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్

కరీంనగర్:
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతామనే భయంతోనే మంత్రి పొన్నం ప్రభాకర్ తనను వెధవ అంటూ దూషిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. పొన్నం తిట్లు దీవెనలుగా భావిస్తున్నానని చెప్పారు. పొన్నం వెధవ అంటే తన దృష్టిలో ‘వెయ్యేళ్లు ధనికుడిగా వర్ధిల్లు’’ అని అర్ధమని చెప్పారు. ఓడిపోతామని తెలిసి ఓటుకు రూ.వెయ్యి ఇచ్చి గెలవాలని కాంగ్రెస్ అభ్యర్ధి యత్నిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి 6 గ్యారంటీల అమలు విషయంలో కాంగ్రెస్ చేసిన మోసాలతోపాటు గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసిన ద్రోహాన్ని వివరించి బీజేపీకి ఓటేయించాలని కోరారు. దేశమంతా నరేంద్రమోదీ గాలి వీస్తున్న నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బీజేపీ కార్యకర్తలంతా తమ తమ పోలింగ్ బూత్ ల పరిధిలోని తటస్థ ఓటర్లతోపాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలను కలిసి ఓట్లు అభ్యర్ధించాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఇంటింటికీ పార్టీ పన్నా ప్రముఖ్ లు పోలింగ్ తేదీ నాటికి ప్రతి ఇంటికీ 5 సార్లు వెళ్లి ఓట్లు అభ్యర్ధించడంతోపాటు తమ తమ పోలింగ్ బూత్ పరిధిలో 100 శాతం పోలింగ్ జరిగేలా కృషి చేయాలని సూచించారు. శనివారం మధ్యాహ్నం బోయినిపల్లి మండలానికి వచ్చిన బండి సంజయ్ మాజీ ఎమ్మెల్యే బోడిగె శోభతో కలిసి పార్టీ పన్నా ప్రముఖుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. మోదీ పాలనలో దేశ అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేయడంతోపాటు దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల పరిష్కారం కోసం విప్లవాత్మక చర్యలు తీసుకున్న ఘనత నరేంద్రమోదీదే అన్నారు. బోయినిపల్లిలో ఒక కుటుంబం అరాచకంగా వ్యవహరించిందని, కొందరు పోలీసులు వారికి వత్తాసు పలికారని ఆరోపించారు. ఇప్పుడు ఆ కుటుంబం పరారీలో ఉందని, వత్తాసు పోలీసుల పరిస్థితి ఇబ్బందిగా మారిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో వెనుకంజ వేయాల్సిన అవసరం లేదని, మీ అందరికీ నేను అండగా ఉన్నాని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. కేసీఆర్ పాలనలోనే ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా, కేసులు పెట్టినా, అరెస్ట్ చేసినా భయపడకుండా పోరాడానని, వందల కేసులు నమోదు చేసినా వెనుకంజ వేయలేదన్నారు. ప్రజలు పోరాడే వారి పక్షాన ఉంటారనడానికి ఎన్నికల ప్రచారంలో తనకు వస్తున్న మద్దతే ఇందుకు కారణమన్నారు. కరీంనగర్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఘోరంగా ఓటమి పాలుకాబోతున్నయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం మోదీపట్ల, బీజేపీపట్ల సానుకూలంగా ఉన్నందున వారిని కలిసి ఓట్లు అభ్యర్ధించాలని కోరారు. బీఆర్ఎస్ అభ్యర్ధి లేఖలు రాయడం, తాను చేసిన అభివృద్ధితోపాటు తెచ్చిన నిధులను తన ఖాతాలో వేసుకోవడం తప్ప సాధించిందేమీ లేదన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉంటూ కూడా కరీంనగర్ ఆర్వోబీ నిర్మాణానికి నిధులు తీసుకురాలేదన్నారు. తాను సేతు బంధన్ స్కీం కింద రూ.154 కోట్లు తెచ్చి ఆర్వోబీని నిర్మిస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జాతీయ రహదారుల విస్తరణ కోసం వేలాది కోట్లు నేను తీసుకొస్తే.. నా లేఖలవల్లే వచ్చాయని చెప్పడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ అనే నాణేనికి బొమ్మ, బొరుసులాంటి వాళ్లు ఇక్కుడున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులని విమర్శించారు. ఇద్దరూ కలిసి చీకటి ఒప్పందాలు చేసుకుని నన్ను ఓడించాలని కుట్ర చేస్తున్నారన్నారు. కరీంనగర్ ప్రజలు వేసిన ఓటుకు విలువ తీసుకొచ్చానే తప్ప ఏనాడూ ఏసీల్లో కూర్చోలే.. మీరున్నారనే ధైర్యంతో కేసీఆర్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడలేదన్నారు. దేశంలో ఏ ఎంపీపైనా లేనన్ని కేసులు నాపై పెట్టినా వెనుకంజ వేయకుండా ఫాంహజ్ లో ఉన్న కేసీఆర్ ను ధర్నా చౌక్ కు గుంజుకొచ్చానని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రెండు సార్లు జైలుకు పంపినా కేసీఆర్ గద్దె దిగే వరకు పోరాడిన చరిత్ర నాదన్నారు. వాస్తవాలు ప్రజలకు వివరించి బీజేపీని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

2 thoughts on “కరీంనగర్ కు వినోద్ కుమార్ చేసింది శూన్యం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *