కార్మికునికి గాయాలు..
గీత కార్మికునికి గాయాలు..
హుజురాబాద్:
ప్రమాదవశాత్తు మోకుజారి తాటి చెట్టు పై నుండి జారిపడ్డ గీతా కార్మికునికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హుజురాబాద్ మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన బొడిగె పాపయ్య అనే గీత కార్మికుడు రోజువారి వృత్తిలో భాగంగా సోమవారం కల్లు తీసేందుకు తాటి చెట్టు ఎక్కాడు. కాగా చెట్టు దిగుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు మోకుజారి చెట్టు పై నుండి కిందపడ్డాడు. దీంతో కార్మికునికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.