తెలంగాణ గొంతు వినిపించాలంటే బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలి

793

విభజన హామీల అమలులో బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్యం
. తెలంగాణ గొంతు వినిపించాలంటే బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలి
. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపెల్లి వినోద్ కు
మార్
హుజూరాబాద్:
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా ఇచ్చిన విభజన హామీలను బీజేపీ ప్రభుత్వం అమలు చేయకుండా నిర్లక్ష్యం చేసిందని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపెల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. శనివారం హుజురాబాద్ పట్టణంలో జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాక ముందు రైతుల ఆత్మహత్యలు, కరెంట్ కోతలు ఉండేవన్నారు. అలాంటి గోస పడ్డ తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు ఆత్మహత్యలను నివారించామని, కరెంట్ కోతలను లేకుండా నిరంతర విద్యుత్ అందించామని గుర్తు చేశారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై పార్లమెంట్లో మాట్లాడాలంటే బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలన్నారు. ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించి తనను ఎంపీగా గెలిపించాలని కోరారు. బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేందుకు కుట్రలు చేస్తున్నదని, దానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వత్తాసు పలుకుతున్నాడని దుయ్యబట్టారు. కాశీ ఎంపీగా ఉన్న మోడీ ప్రధానిగా కాశీ అభివృద్ధికి మాత్రమే నిధులు ఇచ్చి దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన వేములవాడ అభివృద్ధికి నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ కరీంనగర్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని మోడీని ఎందుకు అడగలేదన్నారు. ఎంపీగా గెలచి ఏ ఒక్కనాడు నియోజకవర్గంలోని మండల, జడ్పీల సమావేశాలకు హాజరు కాలేదన్నారు. కనీసం ఐదేళ్లలో పార్లమెంట్ పరిధిలోని ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్న పాపాన పోలేదన్నారు. తెలంగాణ, కరీంనగర్ అభివృద్ధి కోసం నిధలు ఇవ్వమని అడగని బండి సంజయ్ మీకు మళ్లీ అవసరమా అన్నారు. తెలంగాణ కోసం బీఆర్ఎస్ ఎంపీలంతా కొట్లాడినమన్నారు. తను ఎంపీగా ఉన్నప్పుడు పలు నూతన రైలు మార్గాలను జాతీయ రహదారుల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించి నిధులు మంజూరు చేయించానని తెలిపారు. ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండి ప్రజల కష్టసుఖాలు తెలసిన వ్యక్తిగా తనను ఆధరించి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *