ప్రజలకు అండగా ఉంటా : వొడితల ప్రణవ్

ప్రజా తీర్పును గౌరవిస్తా…నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటా…
. కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కంటికి రెప్పలా కాపాడుకుంటాం..
. నాయకులు, కార్యకర్తలు ఎవరూ అదైర్య పడొద్దు…
. ప్రేమతో ఓటేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు
. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల ప్రణవ్

హుజురాబాద్:
హుజురాబాద్ నియోజకవర్గానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిర్వీరామంగా పార్టీ కోసం పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు, అభిమానులకు, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఆశీర్వదించిన ఓటర్ మహాశయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్ తెలిపారు. ఆదివారం ఎన్నికల ఫలితాల అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక సాధారణ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో చేరిన తనకు కాంగ్రెస్ అధిష్టానం అవకాశం ఇవ్వగా ఓట్లు వేసి ఆశీర్వదించిన హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు ప్రణవ్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ గెలుపు కోసం అహర్నిశలు పాటుపడిన కార్యకర్తలకు నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తలు, నాయకులు అధైర్య పడవద్దని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలను కంటికి రెప్పలాగా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను నియోజకవర్గంలోని ప్రతి గడపకు అందజేసేందుకు కృషి చేస్తానన్నారు.