బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కి చికిత్స
యశోద ఆసుపత్రిలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కి చికిత్స
. హెల్త్ బులిటిన్ విడుదల చేసిన యశోద డాక్టర్లు
. జారిపడటంతో విరిగిన ఎడమకాలు తుంటి ఎముక
. రిప్లేస్ చేయడానికి శస్త్రచికిత్స చేయాలన్న వైద్యులు
. కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం
. రెస్ట్ తీసుకోవాలని సూచించిన యశోద వైద్యులు
హైదరాబాద్:
ఎర్రవల్లిలోని తననివాసంలో గురువారం రాత్రి బాత్ రూంలో కాలుజారిపడటంతో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు ఎడమకాలితుంటి ఎముక ప్రాక్చర్ అయింది. వెంటనే సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వారికి యశోద దవాఖానాలో డాక్టర్లు చికిత్స అందజేస్తున్నారు. సిటీ స్కాన్ చేసిన వైద్యులు ఎడమకాలి తుంటి విరిగిందని, శస్త్రచికిత్స ద్వారా రీప్లేస్ చేయాల్సి వస్తుందని డాక్టర్లు హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. కోలుకోవడానికి ఇందుకు 6 నుంచి 8 వారాల సమయం పడుతుదని తెలిపారు. కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని తెలిపారు. యశోద దవాఖానాలో చికిత్స పొందుతున్న కేసీఆర్ వెంట భార్య శోభమ్మ, తనయుడు మాజీ మంత్రి కేటీఆర్..కూతురు కవిత, ఎంపీ సంతోష్ కుమార్, మాజీ మంత్రి హరీష్ రావు తదితర కుటుంబ సభ్యులు ఉన్నారు. వార్త తెలిసిన నేపధ్యం లో పరామర్శించేందుకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు , అభిమానులు ఆస్పత్రికి భారీగా తరలివస్తున్నారు. కాగా కేసీఆర్ కు శస్త్ర చికిత్స జరుగుతున్న నేపథ్యంలో డాక్టర్స్ ఎవరిని అనుమతించడం లేదు. నేతలు, అభిమానులు కార్యకర్తలు ఎవరు ఆందోళన చెందవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు