పాత్రికేయుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి

0
  • కొత్త ప్రభుత్వానికి టీడబ్ల్యూజేఎఫ్ విజ్ఞప్తి
  • ఘనంగా టీడబ్ల్యూజేఎఫ్ సిద్దిపేట జిల్లా మహాసభ 

 హుస్నాబాద్ :

తెలంగాణలో జర్నలిస్టుల సమస్యలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, పదేళ్లుగా జర్నలిస్టులు ఎన్నో అవమానాలు , అన్యాయాలకు గురయ్యారని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సమస్యలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అయినా త్వరితగతిన పరిష్కరించాలని ఆయన కోరారు. గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని అణభేరి సింగిరెడ్డి అమరుల భవన్(సీపీఐ కార్యాలయం)లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా ద్వితీయ మహాసభ జరిగింది.

ఈ మహాసభలో రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జర్నలిస్టులను గౌరవించి ఆదుకోవాల్సిన పాలకులు విస్మరించడం సరైంది కాదని అన్నారు. జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతున్న ఏకైక యూనియన్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ మాత్రమే అని అన్నారు.

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, ఉద్యోగ, ఆరోగ్య భద్రత, పెన్షన్ స్కీమ్, హెల్త్ స్కీమ్, ప్రత్యేక రక్షణ చట్టం వంటి డిమాండ్ల సాధనకై నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు. అవకాశవాద జర్నలిస్టు సంఘాలకు భిన్నంగా, జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న సంఘం టీడబ్ల్యూజేఎఫ్ అని మామిడి సోమయ్య అన్నారు.

సిద్దిపేట జిల్లాలో అన్యాయానికి గురవుతున్న జర్నలిస్టులకు అండగా ఉంటూ సంఘాన్ని బలోపేతం చేయాలని ఆయన జిల్లా నాయకత్వాన్ని కోరారు. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఐఎఫ్ డబ్ల్యూజే) కార్యదర్శి పులిపలుపుల ఆనందం మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జర్నలిస్టుల హక్కుల కోసం ఐఎఫ్ డబ్ల్యూజే పోరాడుతుందని తెలిపారు. జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలని, ఇందు కోసం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలనే డిమాండ్ తో ఐఎఫ్ డబ్ల్యూజే పోరాడుతుందని అన్నారు.

టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా టీడబ్ల్యూజేఎఫ్ బలంగా ఉందని, సిద్దిపేట జిల్లాలో కూడా తిరుగులేని యూనియన్ గా తయారు చేయాలని కోరారు. ఫెడరేషన్ జిల్లా అడ్ హక్ కమిటీ కో-కన్వీనర్ ఎల్లయ్య అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో స్థానిక మున్సిపల్ ఛైర్ పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్మన్ అయిలేని అనిత, ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు జే. రాజలింగం, జాతీయ కౌన్సిల్ సభ్యులు కుడితాడు బాపురావు, యూసుఫ్, అయిలయ్య, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు సమ్మయ్య గౌడ్, సిద్దిపేట జిల్లా కన్వీనర్ మురళీధర్ స్వామి, బీఎస్పీ నేత శంకర్, బీసీ సంక్షేమ సంఘం నాయకుడు రవీందర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

 

టీడబ్ల్యూజేఎఫ్ సిద్దిపేట జిల్లా నూతన కార్యవర్గం

  • అధ్యక్షుడిగా మురళీధర స్వామి
  • కార్యదర్శిగా మేకల ఎల్లయ్య ఎన్నిక

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) సిద్దిపేట జిల్లా ద్వితీయ మహాసభ గురువారం హుస్నాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఫెడరేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడుగా వరయోగుల మురళీధర్ స్వామి, కార్యదర్శి గా మేకల ఎల్లయ్య, ఉపాధ్యక్షుడు వేల్పుల సంపత్, సహాయ కార్యదర్శి రాజమల్లు, కార్యవర్గ సభ్యులు ఖుద్రత్ అలీ, వంగా రాజు, జాతీయ కౌన్సిల్ సభ్యుడు జంగం రాజలింగం తదితరులు ఎన్నికయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *