ఆర్టీసీ డిపో మేనేజర్ గా శ్రీకాంత్
ఆర్టీసీ డిపో మేనేజర్ గా శ్రీకాంత్
హుజురాబాద్:
హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ సామల శ్రీకాంత్ శనివారం బాధ్యత స్వీకరించారు. కల్వకుర్తి డిపో మేనేజర్ గా పని చేసిన సామల శ్రీకాంత్ హుజురాబాద్ డియంగా బాధ్యతలు స్వీకరించి సందర్భంగా కార్మికులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత డిపో మేనేజర్ గా పని చేస్తున్న పుప్పాల అర్పిత వరంగల్ లోని స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా బదిలీ అయ్యారు. రెండు సంవత్సరాల కాలంలో హుజురాబాద్ డిపోను రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలపడానికి మేనేజర్ అర్పిత ఎంతగానో కృషి చేశారని కార్మికులు అన్నారు. ఈ సందర్భంగా అర్పిత మాట్లాడారు. హుజురాబాద్ డిపో లాభాల్లోకి రావటంలో కార్మికులు ఎంతగానో కష్టపడ్డారని తెలిపారు. ఈ సందర్భంగా బదలీపై వెలుతున్న అర్పిత ను కార్మికులు, ఉద్యోగులు ఘనంగా సన్మానించారు.