ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి..

0

ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి..
. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన
. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హనుమకొండ:
రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించామని వాటిని వెంటనే పరిష్కరిస్తామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హన్మకొండ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనీ 12 అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లా అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ విధానాలను మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని రెండు మండలాలు హన్మకొండలో ఉన్నాయన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి పై చర్చించడానికి సమావేశంలో పాల్గొన్నానని తెలిపారు. నిరంతర అభివృద్ధి పై ప్రభుత్వం మరింత దృష్టి సారించిందన్నారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ… ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న నియోజక వర్గాల వారీగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ…అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో సమస్యల పరిష్కారం, నిధుల కేటాయింపుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందన్నారు. నియోజకవర్గాల్లో ఎలాంటి సమస్యలు ఉన్న జిల్లా ఇంఛార్జి మంత్రి, జిల్లా మంత్రుల దృష్టికి తీసుకురావాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *