శీతాకాల విడిది కోసం హైదరాబాదుకు రానున్న రాష్ట్రపతి

0

ఈ నెల 18న హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి…

హైదరాబాద్‌:
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం ఈ నెల 18న హైదరాబాద్ కు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి వివిధ శాఖల ఉన్నతాధికారులతో బుధవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఐదు రోజులపాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేస్తారు. ఈ నెల 23న తిరిగి ఢిల్లీకి వెళ్తారు. కాగా రాష్ట్రపతి పర్యటన కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *