ఈ నెల 7న బీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో భారీ కృతజ్ఞత సభ
![](https://navatelanganabapurao.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-05-at-1.25.20-PM-1024x768.jpeg)
- 7న ఖమ్మంలో కేసీఆర్కు కృతజ్ఞత సభ
- రెండో సారి రాజ్యసభకు వద్దిరాజును ఎంపిక చేసిన పింక్ పార్టీ బాస్
- ఈ సందర్భంగా మాజీ సీఎంకు ‘భారీ కృతజ్ఞత సభ’
ఖమ్మం:
బీఆర్ఎస్ పార్టీ నుండి రాజ్యసభ సభ్యుడిగా బహుజనుల ముద్దుబిడ్డ వద్దిరాజు రవిచంద్ర ను రెండోసారి ఎంపిక చేసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఖమ్మం నగరంలో భారీ కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు తెలిపారు. బైపాస్ రోడ్ లోని గాయత్రి గ్రౌండ్స్ లో సాయంత్రం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభలో మాజీ మంత్రి, తెలంగాణ ఉద్యమ నాయకుడు హరీష్ రావు తో పాటు ఇతర ముఖ్య నాయకులు హాజరవుతారని పేర్కోన్నారు. ఈ మేరకు మంగళవారం మధు.. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ తో కలిసి సభాస్థలిని పరిశీలించారు.
సభకు జిల్లా నలుమూలల నుండి హాజరయ్యే బీఆర్ఎస్ కార్యకర్తలకు అవసరమైన తాగునీరు, మజ్జిగ ఏర్పాట్లు చూడాలని నిర్వాహకులకు సూచించారు. సభా ప్రాంగణంలో స్టేజి మైక్ కుర్చీలు తదితర ఏర్పాట్ల పై కూడా సమీక్షించారు. ఖమ్మం జిల్లా నుంచి బీసీ నేతగా ఎదిగిన వద్దిరాజు రవిచంద్ర కు రెండోసారి రాజ్యసభ అవకాశం దక్కడం బీఆర్ఎస్ కార్యకర్తల శ్రమకు తగ్గ ఫలితం అని తెలిపారు.
ఇదే ఉత్సాహంతో రేపటి పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపునకు కార్యకర్తలంతా సమిష్టిగా కృషి చేయాలనీ సూచించారు. సభాస్థలిని పరిశీలించినవారిలో తల్లాడ ఎంపీపీ దొడ్డా శ్రీనివాస్ రావు, బీఆర్ఎస్ నాయకులు శీలంశెట్టి వీరభద్రం, పైడిపల్లి సత్యనారాయణ, డోకుపరతి సుబ్బారావు, బిచ్చాల తిరుమలరావు, కాసాని నాగేశ్వరరావు తదితరులున్నారు.