అధికారులు సమన్వయంతో పనిచేయాలి
![](https://navatelanganabapurao.com/wp-content/uploads/2023/12/IMG-20231219-WA0754-1024x461.jpg)
ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి
. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్
రామగుండం:
ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎన్.టి.పి.సి లోని మినిలియం హాల్ లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అంతర్గాం మండల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత 6నెలలుగా కళ్యాణ లక్ష్మి దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని వాటిని త్వరగా పూర్తి చేయాలన్నారు. సాగు, త్రాగు నీరు, విద్యుత్ లైట్లు, రోడ్లు సమస్యలను పరిష్కరించాలన్నారు. వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చూడాలన్నారు. మహిళలకు ఉపాధి కల్పించే విషయాలపై చర్చించారు. ఇసుక అక్రమ రవాణాలను అరికట్టాలన్నారు. పనులు చేయకుండా నిర్లక్ష్యం ఇస్తున్న కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు. ఈ సమావేశంలో తహసిల్దార్ రామ్మోహన్ రావు మండల అభివృద్ధి అధికారి యాదగిరి తో పాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.