హుజురాబాద్ లో మహాలక్ష్మి పథకం ప్రారంభం

హామీని నిలబెట్టుకున్నాం…
. హుజురాబాద్ లో మహాలక్ష్మి పథకం ప్రారంభం
. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్

హుజూరాబాద్ :
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు హామీల అమలు చేసిందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ అన్నారు. శనివారం ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలలో మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అమలు చేసింది. ఈ కార్యక్రమాన్ని హుజూరాబాద్ బస్టాండ్ లో ఆర్టీసీ డీపో మేనేజర్ అర్పిత, ఎక్సైజ్ సిఐ దుర్గాభవానీలతో కలిసి వొడితల ప్రణవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే కచ్చితంగా అమలు చేస్తుందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు ఆలేటి సుశీల, మండల అధ్యక్షులు కొల్లూరి కిరణ్, రాజేశ్వరరావు, శ్యామ్ సుందర్ రెడ్డి, చరణ్, పట్టణ అధ్యక్షుడు సొల్లు బాబు, పట్టణ మహిళా అధ్యక్షురాళ్లు యేముల పుష్పలత, పూదరి రేణుక, రజిత, సీనియర్ నాయకులు సాహెబ్ హుస్సేన్, మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండి అప్సర్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు చల్లూరి రాహుల్, పానుగంటి కిరణ్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.