వేములవాడ రాజన్నను దర్శించుకున్న మున్నూరు కాపు సంఘం నేతలు

0

కరీంనగర్:

తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ సాధనకు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మొక్కులు చెల్లించినట్లు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు తెలిపారు.

వేములవాడ రాజన్న సన్నిధిలో నాయకులు..రెండు కోడెల మొక్కులు చెల్లించారు.అనంతరము స్వామివారిని దర్శనం చేసుకొని .. ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ను పార్లమెంట్ ఎన్నికల ముందు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు.

తర్వాత కరీంనగర్ జిల్లాలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో మున్నూరు కాపు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండ దేవయ్య పటేల్ , ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఎడ్ల రవి పటేల్ , మున్నూరుకాపు యువత రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షులు బండి సంజీవ్ , మున్నూరుకాపు సంఘం తెలంగాణ చింతపండు మహేందర్ పటేల్, గ్రేట్ హైదరాబాద్ అధ్యక్షులు ఆర్ వీ మహేందర్ కుమార్ పటేల్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆకుల బాలకృష్ణ పటేల్ , గ్రేటర్ యూత్ అధ్యక్షులు దేశెట్టి శివ పటేల్, చింత పండు మహేందర్ , హైదరాబాద్ నుంచి విచ్చేసి సిరిసిల్ల మున్నూరు కాపు సంఘం కన్వీనర్ అగ్గి రాముడు, కల్లూరి రాజు, నీలి శంకర్ యూత్ అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొనగా, బండారు శ్యామ్ అధ్యక్షతన విలేకరుల సమావేశం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *