టీడబ్ల్యూజేఎఫ్ మీడియా డైరీ-2024 ఆవిష్కరణ 

0

 హైదరాబాద్:

జర్నలిస్టులకు ప్రభుత్వం ఇండ్ల స్థలాలు ఇచ్చే విషయంలో తాను శాయశక్తులా కృషి చేస్తానని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) మీడియా డైరీ-2024 ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయమై తాను చొరవ తీసుకుని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమగ్ర మీడియా సమాచారంతో డైరీ తీయడంతో పాటు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నందుకు ఫెడరేషన్ నాయకులకు మంత్రి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం, పిల్లి రాంచందర్, కార్యదర్శులు సలీమా, గుడిగ రఘు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *