పివి జిల్లాగా ప్రకటించాలి
హుజురాబాద్ ను పివి జిల్లాగా ప్రకటించాలి
హుజురాబాద్:
హుజరాబాద్ ను పివి జిల్లాగా ప్రకటించాలని ఆలయన్స్ క్లబ్, పివీ సేవా ట్రస్ట్ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో అలయన్స్ క్లబ్, పివి సేవాట్రస్టు ఆధ్వర్యంలో దివంగత మాజీ ప్రధాని పివి 19వ వర్ధంతిని నిర్వహించి పి.వి చిత్రపటం ముందు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పివీ దేశానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. పీవీ నరసింహారావు కు భారతరత్న ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బత్తుల మనోజ్, ఉపాధ్యక్షులు డాక్టర్ రామలింగారెడ్డి, తూము వెంకటరెడ్డి, వైద్యులు తొగరు విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి టి.మాధవ రావు, ముక్కెర కనుకయ్య, రావుల తిరుపతి రెడ్డి, సదానందం, మాజీ సర్పంచ్ పంజాల సుధాకర్, ఎన్నారై ఏ.రణదేప్ రెడ్డి, సాగి శివప్రసాద్ రావు, రామచంద్రం, వినోద్ తదితరులు పాల్గొన్నారు.