144 సెక్షన్ అమలు: పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి

కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు
. పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి

కరీంనగర్:
అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న ఆదివారం జరగనున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా 144 సెక్షన్ ఆఫ్ సి.ఆర్.పి.సి. అమలు చేస్తున్నట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేలా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టామన్నారు. ఈ ఉత్తర్వులు ఈ నెల 3వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటల నుండి 4 సోమవారం ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయని తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఐదుగురికి మించి గుమికూడరాదన్నారు. ఏదైనా చట్ట పరిధిలోని కారణం చేత సమావేశం కావాల్సి వస్తే సంబంధిత అధికారి వద్ద ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.