కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్…

0

తెలంగాణలో కొత్త రేషన్‌కార్డుల జారీకి ప్రభుత్వం చర్యలు

హైదరాబాద్:
కొత్త రేషన్‌ కార్డుల కోసం తెలంగాణ ప్రజల ఎదురుచూపులు చూస్తున్నారు. గత 9 ఏళ్లుగా కొత్త రేషన్‌ కార్డులు జారీ జారీ కాలేదు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీకి చర్యలు చేపట్టనుంది. త్వరలోనే అప్లికేషన్లు స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది. విధివిధానాలు రూపొందిస్తూ ఇప్పుడున్న రేషన్‌ కార్డులపై సమీక్ష చేయనుంది. కొన్ని నెలలుగా రేషన్‌ తీసుకోని కార్డులు ఉంచాలా..తీసేయాలా అనేదానిపై అధికారులతో చర్చలు జరపనున్నారు. అసలైన అర్హులకే కార్డులుండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. కొత్త కార్డులకు ఎవరు అర్హులనే దానిపై కూడా చర్చలు జరిపారు. సంక్షేమ పథకాలకు, రేషన్‌ కార్డులకు అనుసంధానం లేకుండా ఉండేలా చర్యలు. సంక్షేమ పథకాలకు రేషన్‌ కార్డు అనుసంధానిస్తే..కార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కొత్త కార్డుల జారీకి ఆదాయ పరిమితి ఎంత విధించాలనే దానిపై ఈ వారంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *