పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి

0

పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి
. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

వరంగల్:

రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులు ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కోరారు. వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలోని అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఈ దిశగా రాజకీయ పార్టీలు, నాయకులు ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు.
ఓటు నమోదు దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ ఫిబ్రవరి 6వ తేదీ కాగా ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన ఫిబ్రవరి 24న, అదేవిధంగా ఫిబ్రవరి 24 నుంచి మార్చి 14 వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుందన్నారు. అలాగే అభ్యంతరాల పరిష్కారం అనంతరం మార్చి 29వ తేదీతో పాటు తుది జాబితా ఏప్రిల్‌ 4న విడుదల చేస్తామన్నారు. ఫిబ్రవరి 6వ తేదీ వరకు ఓటరు నమోదు అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో 2023 నవంబర్ 1వ తేదీ నాటికి డిగ్రీ పూర్తయి మూడేళ్లు నిండిన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కోరారు. లేదాhttps:ceotserms2.telangana.gov.in/mlc/form18.aspx వెబ్ సైట్ ద్వారా కూడా ఓటర్ గా నమోదు చేసుకోవచ్చన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *