ఘనంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వార్షికోత్సవం

0
  • ఆ కౌన్సిల్ నాయకులు డ్యాగల శ్రీనివాస్ కు ఘన సన్మానం

హైదరాబాద్ :
హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని కాలేజీ ఆఫ్ టెక్నాలజీ ఆడిటోరియంలో రాష్ట్ర అధ్యక్షులు ఐలినేని శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (ఎన్ హెచ్ ఆర్ సి) వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని వరంగల్ ఉమ్మడి జిల్లా ఇంచార్జ్, వరంగల్ జిల్లా అధ్యక్షులు డ్యాగల శ్రీనివాస్ ను.. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ పి. సంపత్ కుమార్ షీల్డ్ తో పాటు మెమోంటో ఇచ్చి సత్కరించారు. ఈసందర్భంగా డ్యాగల శ్రీనివాస్ మాట్లాడుతూ
నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (ఎన్ హెచ్ ఆర్ సి) వార్షికోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ అధ్యక్షులు డాక్టర్ పి సంపత్ కుమార్ చేతుల మీదుగా షీల్డ్, మెమోంటోతో సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సేవా కార్యక్రమాలతో పాటు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటుందని అన్నారు.

అదే విధంగా వరంగల్ జిల్లాతో పాటు వరంగల్ ఉమ్మడి జిల్లాలు అయిన హన్మకొండ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాలలో ఎన్ హెచ్ ఆర్ సి కమిటీని ఆర్గనైజింగ్ సభ్యులతో బలోపేతం చేసేందుకు తన కృషి చేస్తానని తెలిపారు. తనను గుర్తించి సన్మానం చేసినందుకు జాతీయ అధ్యక్షులు సంపత్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు ఐలినేని శ్రీనివాస్ రావు గార్లకు డ్యాగల శ్రీనివాస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు నాగరాజు, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నూరి రవి కుమార్, జిల్లా కార్యదర్శి పసుల అశోక్ కుమార్, జిల్లా యూత్ వింగ్ కన్వీనర్ కొడకండ్ల శ్యామ్ సుందర్, నర్సంపేట పట్టణ మహిళా అధ్యక్షురాలు మోడెం మౌనిక లతో పాటు వివిధ జిల్లాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *