వన జాతరకు పోటెత్తిన భక్తులు

0

మేడారంకు పోటెత్తిన భక్తులు..

ములుగు:
మేడారం సమ్మక్క సారక్క జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో సోమవారం వేలాదిగా సమ్మక్క-సారక్క సన్నిధికి తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలు ప్రతి రెండేళ్లకోసారి జరుగుతాయి. ఈ జాతరకు దేశంలోని పలు రాష్ట్రాల నుండి భక్తులు హాజరై తమ మొక్కులు చెల్లించుకుంటారు. 2024 ఫిబ్రవరిలో జరిగే ఈ జాతరకు పెద్ద ఎత్తున జనం వచ్చే అవకాశాలున్నందున ముందస్తుగానే భక్తులు సమ్మక్క-సారలమ్మ లను దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *