గణిత శాస్త్ర సూత్రాలతోని శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి
![](https://navatelanganabapurao.com/wp-content/uploads/2023/12/IMG-20231222-WA0711-1024x461.jpg)
శ్రీనివాస రామానుజన్ ప్రపంచానికి ఆదర్శం
హుజురాబాద్:
గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ ప్రపంచానికి ఆదర్శం అని, ఆయనను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు చదువుకోవాలని విఎస్ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వివిఎన్ హనుమ కుమార్ విద్యార్థులకు సూచించారు. శుక్రవారం సింగపూర్ లోని విఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో గణిత శాస్త్రవేత్త రామానుజన్ జయంతి ఉత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. గణిత శాస్త్ర సూత్రాల పైననే ప్రపంచ దేశాల అభివృద్ధి ఆధారపడి ఉందన్నారు. గణితం లేకుండే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం లేదని అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి గణితం పైనే ఆధారపడి ఉందని విద్యార్థులు గణితాన్ని నిర్లక్ష్యంగా తీసుకోకూడదని, ఎంతో ఆసక్తితో గణితం పట్ల మక్కువ పెంచుకొని కష్టపడి ఇష్టపూర్వకంగా చదివితే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. శ్రీమానువాస రామానుజన్ ప్రతిపాదించిన
సూత్రాలపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు చేస్తున్నారని ఆయనను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.