పంట రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

0

ఋణాలను సద్వినియోగం చేసుకోవాలి
. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్:
కెడిసిసి ద్వారా ఆందించే ఋణాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి సాంకేతిక కమిటి సమావేశానికి (డిఎల్టిసి)లో ఆమె హాజరయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడారు. ఆయిల్ పామ్ సాగు కొరకు ఇస్తున్న టర్మ్ లోన్ ను మరియు అంతర్ పంటలకు కెసిసి ద్వారా ఇస్తున్న ఋణాన్ని పంటసాగు చేయు రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఉద్యానవన పంటలు మరియు వర్కింగ్ క్యాపిటల్, పాడి పశువులు, చేపల పెంపకం, పౌల్ట్రీలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ను ఉమ్మడి జిల్లాకు ప్రతిపాధించి, రాష్ట్రస్థాయి సాంకేతిక సమావేశానికి సిఫారసు చేశారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ డిడియం జయప్రకాశ్, కేడీసీసీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సత్యనారాయణ, కరీంనగర్, జగిత్యాల జిల్లాల ఎల్డియంలు ఆంజనేయులు, వెంకట్ రెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్లా జిల్లాల వ్యవసాయాధికారులు శ్రీధర్, వి. బాస్కర్, పశువైద్యాధికారి నరేందర్, ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, ఇతర అధికారులు, బ్యాంకు మెనేజర్లు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *