రైతుల ఖాతాల్లో జమ కానున్న పెట్టుబడి సహాయం..
రైతు బంధు చెల్లింపుకు సీఎం ఆదేశం..
హైదరాబాద్ :
ఎన్నికల సందర్భంగా “రైతుబంధు” పంట పెట్టుబడి సహాయాన్ని ఎన్నికల కమిషన్ నిలిపివేసిన విషయం తెలిసిందే. కాగా రైతుబంధు పంట పెట్టుబడి సహాయాన్ని అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి శనివారం ఆదేశాలు జారీ చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు సహాయం అందించేందుకు ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా పెట్టిన రైతు భరోసా మేనిఫెస్టో విధివిధానాలను ఇంకా ఖరారు కాలేదు. దీంతో ప్రస్తుతానికి గతంలో ఇచ్చిన ప్రకారమే పెట్టుబడి సాయం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ లెక్కన గతంలో మాదిరిగానే ఎకరానికి రూ.5వేల చొప్పున రైతులకు పంట పెట్టుబడి సాయం అందనుంది.