మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించిన ప్రముఖులు

0

కెసిఆర్ ను పరామర్శించిన చంద్రబాబు
హైదరాబాద్:
హైదరాబాదులోని సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను టీడీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం పరామర్శించారు. డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
నటుడు చిరంజీవి…
సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రముఖ సినీ నటుడు చిరంజీవి శనివారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కెసిఆర్ ను పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క..
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి సోమాజిగూడ యశోదలో పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్…
య‌శోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ ను భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్, బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లు పరామర్శించారు. ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందున కేసీఆర్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి గురించి ఆరా తీశారు. కోలుకుంటున్న విషయం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మోత్కుపల్లి, చల్మడ లక్ష్మి నరసింహారావు తదితరులు కూడా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *