రాజీనామా చేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు..

పదవులకు రాజీనామా చేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు..

హైదరాబాద్:
బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి లు తమ ఎమ్మెల్సీ పదవులకు శనివారం రాజీనామా చేశారు. తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని చైర్మన్ ఛాంబర్ లో కలిసి రాజీనామా లేఖలను అందజేశారు. నవంబర్ 30న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన కారణంగా తమ ఎమ్మెల్సీ పదవులకు వారు రాజీనామా చేశారు. కాగా శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాజీనామాలకు ఆమోదం తెలిపారు.