ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

0

పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేయాలి
. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్

కరీంనగర్:
రానున్న పార్లమెంట్ ఎన్నికలకు ఓటర్ జాబితా తయారీతో పాటు ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. బుధవారం పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. మరి కొద్ది రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు జరుగనున్నందున ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించి ఫార్మ్స్ 6, 7, 8 పెండింగ్ ఉన్న వాటిని పూర్తి చేయాలనీ, ఎన్నికల ఓటర్ల జాబితా నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు. జాబితాలో తప్పులు లేకుండా చూడాలన్నారు. 18 సంవత్సరాలు వయస్సు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు అయ్యే విధంగా చూడాలన్నారు. దీని కోసం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, మార్పులు చేర్పులు చిరునామా మారిన వారు చేసుకున్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డిఆర్ఓ పవన్ కుమార్, కరీంనగర్ ఆర్డివో కే మహేశ్వర్, హుజురాబాద్ ఆర్డివో రాజు, కరీంనగర్ మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్, కరీంనగర్ తహసీల్దార్ రమేష్, హుజురాబాద్ తహసిల్దార్ విజయ్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *