కేసీఆర్ ను పరామర్శించిన ఏపీ సీఎం..
కేసీఆర్ ను పరామర్శించిన ఏపీ సీఎం జగన్..
హైదరాబాద్:
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల ఫామ్ లో కాలు జారిపడి చికిత్స పొందిన తర్వాత వైద్యుల సూచనల మేరకు కేసీఆర్ నంది నగర్ లో గల ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా గురువారం హైదరాబాదు కు వచ్చిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నందినగర్ లోని కెసిఆర్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కెసిఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కెసిఆర్ ఇంటికి వచ్చిన సీఎం జగన్ కు కేటీఆర్ పూల బొకే అందించి స్వాగతం పలికారు.