అభివృద్ధి నిధులన్నీ కేంద్రానివే..

0

గ్రామాల్లో జరిగే అభివృద్ధి నిధులన్నీ మోదీ సర్కార్ వే..
. బీఆర్ఎస్ పాలనలో నిర్బంధాల మధ్య అధికారులు పనిచేశారు
. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్
. దివ్యాంగులకు ట్రై సైకిల్స్ సహా 18 ఉప కరణాలను పంపిణీ

కరీంనగర్:
కరీంనగర్ జిల్లాలో దివ్యాంగులు, మహిళలు, వృద్ధులు శిశువు సంక్షేమం కోసం గత మూడేళ్లలో కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.100 కోట్లు ఖర్చు చేసిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. బుధవారం కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన ‘సామాజిక అధికార శిబిరం’ లో బండి సంజయ్ పాల్గొని దివ్యాంగులకు ట్రై సైకిల్స్, చేతి కర్రలు, వినికిడి యంత్రాలుసహా 18 రకాల ఉపకరణాలను పంపిణీ చేశారు. జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమశాఖ సరస్వతి, అనిల్ కుశాల్ తోపాటు దివ్యాంగుల అసోసియేషన్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. గ్రామాలు, పట్టణాల్లో జరిగే అభివృద్ధి నిధులన్నీ కేంద్రానివేనని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో అధికారులు నిర్బంధాల మధ్య పనిచేశారన్నారు. కేంద్ర నిధులతో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను ఆనాడు నిర్వహించాలనుకుంటే అధికారులు రాకుండా ఒత్తిడి చేసే వారని అన్నారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదని, అధికారులు స్వేచ్ఛగా పనిచేస్తున్నారని చెప్పారు. ఏడీఐపీ (Assistance to Disabled Persons), ఆర్వీవై (రాష్ట్రీయ వయోశ్రీ యోజన) పథకం కింద కరీంనగర్ జిల్లాలో ఈరోజు 731 మంది దివ్యాంగులకు కేంద్ర నిధులతో కొనుగోలు చేసిన ట్రై సైకిల్స్ ను పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 433 మందికి, హుజూరాబాద్ అసెంబ్లీ పరిధిలో 297 మందికి ట్రై సైకిల్స్ ఇవ్వడం జరిగిందన్నారు. గతేడాది వేములవాడలో ప్రత్యేక శిబిరం నిర్వహించి పెద్ద ఎత్తున పరికరాలను పంపిణీ చేశామన్నారు. రానివాళ్లు బాధపడాల్సిన పనిలేదు. ఎంతమంది దరఖాస్తు చేసుకుంటే అంతమందికి అతి త్వరలో ఉప కరణాలు అందిస్తామన్నారు. అంగన్ వాడీ కేంద్రాల్లో బాలామృతం గుడ్డు సహా పిల్లలకు అందించే పోషకాహారం కేంద్ర నిధులతో అందిస్తున్నారన్నారు. గర్భిణీ మహిళలకు పౌష్టికాహారం, గడ్లు, పాలుసహా అన్నింటికీ కేంద్రమే నిధులిస్తూ గర్భిణీ మహిళలు, పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడకుండా ఆరోగ్యవంతంగా జీవనం కొనసాగేలా చేస్తోందన్నారు. వృద్ధులకు దివ్యాంగ ఆశ్రమాలకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులను విడుదల చేస్తూ వారి జీవనానికి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటోందన్నారు. పార్లమెంట్ పరిధిలో ఇప్పటి వరకు గర్బిణీ మహిళలు, పిల్లలు, వృద్ధుల సంక్షేమం కోసం దాదాపు 100 కోట్లను కేంద్రం ఖర్చు చేసిందన్నారు. కేంద్రం చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరినీ కోరారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం లో అన్ని నిర్బంధాలే…
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోలేని పరిస్థితి ఉండేడన్నారు. 3 సార్లు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వం మారిన వెంటనే ఉద్యోగులకు స్వేచ్ఛ వచ్చిందన్నారు. నిజాయితీ, నిబద్దతతో పనిచేస్తున్నారని తెలిపారు. కేంద్ర కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్నారు. గతంలో అధికారులు కేంద్రం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనేవారు కాదు… బీఆర్ఎస్ పాలనలో బెదిరింపుల వల్ల కేంద్రం దివ్యాంగులకు అందిస్తున్న ఉప కరణాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించలేకపోయారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తులోనూ స్వేచ్చగా పనిచేయనివ్వాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ కు పట్టిన గతే వాళ్లకు పడుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *