సలహాదారుల పదవుల రద్దు

0

ప్రభుత్వ సలహాదారుల పదవుల రద్దు
. ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి

హైదరాబాద్:
తెలంగాణ ప్రభుత్వం నియమించిన ప్రభుత్వ సలహాదారుల పదవులను రద్దు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రాజేష్ శర్మ, డిజిపిగా కొనసాగిన అనురాగశర్మలు ఇప్పటివరకు సలహాదారులుగా కొనసాగారు. కాగా వారి పదవులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, ఏకే ఖాన్, జిఆర్ రెడ్డి, ఆర్ శోభ, సోమేశ్ కుమార్, డాక్టర్ చెన్నమనేని రమేష్ పదవులు కోల్పోనున్నారు. వీరి పదవి కాలం శుక్రవారంతో ముగిసిందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *