క్రీడలు విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని అలవరుస్తాయి

0

విద్యార్థులు విద్యతో పాటు, క్రీడల్లో రాణించాలి
. జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు.

హన్మకొండ:
విద్యార్థులు విద్యతో పాటు, క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు. బుధవారం కాజీపేట మండలం కడిపికొండ శివారులో ఉన్న కేంద్రీయ విద్యాలయంలో 15వ వార్షిక క్రీడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడులకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు వెల్కమ్ బ్యాండ్ లతో స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులని ఉద్దేశించి మాట్లాడారు. క్రీడల్లో గెలుపు, ఓటములు సహజం అనీ అన్నారు. క్రీడల్లో సమిష్టిగా ముందుకు సాగుతూ చదువులో సైతం క్రమశిక్షణతో రాణిస్తూ జీవితంలో ఉన్నత స్థానాన్ని చేరుకోవాలన్నారు. క్రీడలు విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందిస్తాయన్నారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల మానసిక, శారీరక శక్తి పెరగడంతో పాటు, సమగ్రత టీమ్‌ స్పిరిట్‌, సాంఘిక బాధ్యతను తీసుకోవడం.. నాయకత్వ లక్షణాలు మెరుగు పడుతాయన్నారు. యోగా, మెడిటేషన్‌, క్రీడలు బోధనలో తప్పని సరి కావాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చూపారని, కేంద్రియ విద్యాలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శుభాషిణి, శ్రీనివాస్, కవిత, వెంకన్న విద్యార్థుల తల్లీ దండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *