రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు విద్యార్థులు ఎంపిక

0

రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక..

కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని గూడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు నెట్ బాల్ క్రీడలో ఉన్నత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నెట్ బాల్ రాష్ట్ర స్థాయికి పలువురు విద్యార్థులు సెలెక్ట్ అవడం అభినందనీయమని ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ తెలిపారు. ఎంపికైన విద్యార్థుల్లో అండర్ 14 విభాగంలో కృష్ణ శ్రీ, నిఖిత, సిద్దు, సృజన్, అభిరామ్ అండర్ 17 వేగం విభాగంలో శ్రీవల్లి, రక్షిత, నాగరాణి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులు మరియు సిబ్బంది అభినందనలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *