హాకీ క్రీడాకారులకు సన్మానం

0

జాతీయ స్థాయికి ఎంపికైన హాకీ క్రీడాకారులకు సన్మానం..

హుజురాబాద్ :
ఇటీవల జాతీయ స్థాయికి ఎంపికైన హుజురాబాద్ హాకీ క్రీడాకారులను శనివారం హై స్కూల్ క్రీడా మైదానంలోని హాకీ క్లబ్ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో సన్మానించి అభినందించారు. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో అండర్ -17 బాలుర విభాగంలో రాష్ట్ర స్థాయి హాకీ టోర్నమెంట్ లో రాజేష్, బాలికల విభాగంలో మేఘన, దత్తప్రియ, నికిత లు ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి హాకీ కి ఎంపికయ్యారు. కామారెడ్డిలో నిర్వహించిన అండర్-14 హాకీ టోర్నమెంట్ లో నిమ్మటూరి మిధున మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి హాకీ క్రీడకు ఎంపికైంది. బాలుర విభాగంలో కొండపాక రిత్విక్ జాతీయ స్థాయి హాకీ టోర్నమెంట్ కు ఎంపికయ్యారు. కాగా వీరిని మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, హాకీ క్లబ్ కార్యదర్శి ఉమామహేశ్వర్, చింత శ్రీనివాస్, హాకీ కోచ్ టి శ్రీనివాస్, కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్, వేల్పుల రత్నం, కౌన్సిలర్ సీనియర్ క్రీడాకారులు భూసారపు శంకర్, భీమగొని సురేష్, శ్యామ్, తిరుపతిలు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… క్రీడలతో పాటు చదువు లో కూడా రాణించాలని, క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం పెంపొందుతుందని తెలిపారు. హుజరాబాద్ కు హాకీ పుట్టినిల్లు లాంటిదని ఎంతో మంది క్రీడాకారులు హుజురాబాద్ నుంచి ప్రయోజకులయ్యారని గుర్తు చేశారు. జాతీయ స్థాయి క్రీడలో రాణించి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు మాటూరి రాజేష్, నిమ్మటూరి సాయి కృష్ణ, గుడ్డేలుగుల ప్రదీప్, చోటు, రాజకుమార్, బత్తుల సమ్మయ్య, వెంపటి సతీష్, సలీం, పంజాల శ్రీధర్ గౌడ్, సారయ్య గౌడ్, రమేష్ తో పాటు పలువురు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *