రేవంత్ రెడ్డి సభతో ఈటల రాజేందర్ కు వణుకు..

రేవంత్ రెడ్డి సభతో ఈటల రాజేందర్ కు వణుకు..
. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిప్పారపు సంపత్
హుజురాబాద్:
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో జమ్మికుంట కేంద్రంలో నిర్వహించిన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సభతో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్, వెన్నులో వణుకు పుట్టిందని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ బాబు పక్షాన నియోజకవర్గ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ నియోజకవర్గంలో మతతత్వ కులతత్వ రాజకీయాలు చేస్తూ మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేస్తున్నాడన్నారు. ఐక్యంగా ఉన్న నియోజకవర్గంలో కులాల మధ్య చిచ్చుపెట్టి కుల సంస్కృతిని పెంచి పోషిస్తున్నాడని మండిపడ్డారు. అంతేకాకుండా ఒకే కులాన్ని రెండు వర్గాలుగా చీల్చి తన రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాడని ఆరోపించారు. ఈటల రాజేందర్ తన బాధను ప్రజల బాధగా చెబుతూ ప్రజలలో సెంటిమెంటు రగిలిస్తాడని ఈ విషయాన్ని ప్రజలంతా గమనించాలన్నారు. నిరుద్యోగులను మోసం చేసిన బీఆర్ఎస్ ను, నీచ రాజకీయాలు చేస్తున్న బిజెపి పార్టీకి బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. నిజాయితీకి మారుపేరైన కాంగ్రెస్ అభ్యర్థి వొడతల ప్రణవ్ ను గెలిపించి హుజురాబాద్ చరిత్రను ప్రజలే తిరగరాయబోతున్నారన్నారు. ఈ సమావేశంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లూరి రాహుల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కెకొల్లూరి కిరణ్, పట్టణ అధ్యక్షులు సొల్లు బాబు, మహిళ అధ్యక్షురాలు లావణ్య తదితరులు పాల్గొన్నారు.