సంక్షేమ ప్రభుత్వాన్ని ఆదరించండి

సంక్షేమ ప్రభుత్వాన్ని ఆదరించండి
– బిఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్ ను ఆశీర్వదించండి
– బీఆర్ఎస్ రాష్ట్ర యువనేత ఇంద్రనీల్

హుస్నాబాద్:
అన్ని వర్గాల సంక్షేమానికి కృషిచేసిన టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరించి ఆ పార్టీ అభ్యర్థి సతీష్ కుమార్ ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని టిఆర్ఎస్ రాష్ట్ర యువనేత ఇంద్రనీల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం నియోజకవర్గంలోని అక్కన్నపేట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లో యువనేత సుడిగాలి పర్యటన చేస్తూ బిఆర్ఎస్ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తన తండ్రి బీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా హుస్నాబాద్ ను వేలకోట్లతో అభివృద్ధి చేశారని, ప్రజలందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ నెల 30న జరిగే శాసనసభ ఎన్నికల్లో ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి హుస్నాబాద్ ఎమ్మెల్యేగా మూడవసారి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో యువనేత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముల్కనూరు గ్రామంలో నూతన గృహప్రవేశ కార్యక్రమానికి యువనేత ఇంద్రనీల్ హాజరయ్యారు. ఎల్కతుర్తి మండలం కోతుల నడుమలో బీఆర్ఎస్ రాష్ట్ర యువనేత ఇంద్రనీల్ ఇంటింటి ప్రచారంలో పాల్గొని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తన తండ్రి సతీష్ కుమార్ కు కారు గుర్తుపై ఓటేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోతుల నడుమలో బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుండి 20 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.