నా జీవితం కరీంనగర్ ప్రజలకే అంకితం…
![](https://navatelanganabapurao.com/wp-content/uploads/2024/03/IMG-20240302-WA1161-1-1024x682.jpg)
కరీంనగర్ ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి..
. పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటా..
. కరీంనగర్ అభ్యర్ధిగా ప్రకటించిన మోదీకి ధన్యవాదాలు
. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్
హుజురాబాద్:
నా జీవితం కరీంనగర్ ప్రజల సేవకే అంకితం చేశానని బిజెపి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్ర శనివారం హుజరాబాద్ నియోజకవర్గంలో సాగింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. కరీంనగర్ ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీ గెలిపించి సత్తా చాటాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రం నుండి అధిక నిధులు తీసుకొచ్చి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల ప్రధాని మోడీకి, జాతీయ నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.