కాంగ్రెస్ విజయభేరి సభను విజయవంతం చేయండి

కాంగ్రెస్ విజయభేరి సభను విజయవంతం చేయండి
. పిసిసి సభ్యుడు పత్తి కృష్ణారెడ్డి

హుజూరాబాద్ :
ఈ నెల 23న జమ్మికుంటలో నిర్వహించే కాంగ్రెస్ విజయభేరి సభకు నియోజకవర్గంలోని ప్రజలంతా అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిసిసి సభ్యులు పత్తి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం హుజరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయభేరి సభకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందన్నారు. జమ్మికుంట పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించే సభకు ప్రజలు కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశానికి టీపీసీసీ నాయకులు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు కొల్లూరి కిరణ్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు చెల్లూరి రాహుల్, మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు ఎండి అప్సర్, సీనియర్ నాయకులు మేకల తిరుపతి, చిట్యాల శంకర్ తదితరులు పాల్గొన్నారు.