కష్టపడి పనిచేసిన కార్యకర్తలే నా హీరోలు : ఎంపీ బండి సంజయ్ కుమార్

భారీ మెజారిటీతో గెలవబోతున్నా…
. తెలంగాణలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలే నా హీరోలు…
. ఓటేసిన కరీంనగర్ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు
. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తాం.
. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్
కరీంనగర్:
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో గెలవబోతున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోనూ మెజారిటీ స్థానాలు గెలవబోతున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో అధికార పార్టీ అనేక అడ్డంకులు సృష్టించిన తట్టుకుని కాషాయ జెండా పట్టుకుని తెగించి కొట్లాడిన కార్యకర్తలే నిజమైన హీరోలని అభివర్ణించారు. కరీంనగర్ లో ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పి అందరికీ స్పూర్తిగా నిలిచేలా చేస్తామన్నారు. పేదల ఇండ్లను కబ్జా చేసేటోళ్లను, భూకబ్జాదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఎన్నికల ప్రశాంతంగా నిర్వహించిన ఎన్నికల సంఘానికి అభినందనలు తెలిపారు. పోలీసులకు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. పోలింగ్ సరళిని చూస్తే నాకు పక్కా నమ్మకం ఏర్పడిందని, కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్ధిగా భారీ మెజారిటీతో గెలవబోతున్నా.. ఆ నమ్మకం నాకుందన్నారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన బీజేపీ కార్యకర్తలు నా హీరోలని, తెలంగాణలో బిఆర్ఎస్ నేతలు ఎన్ని ఇబ్బందులు సృష్టించిన ధీటుగా ఎదుర్కొంటూ కాషాయ జెండాలు పట్టుకుని ముందుకు సాగుతూ తెగించి కొట్లాడిన కార్యకర్తలంతా నాకు హీరోలే అన్నారు. ఎన్నికల్లో పూర్తిగా సహకరించిన మంద కృష్ణ మాదిగతోపాటు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలందరికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా బీజేపీట్ల విశ్వాసం, నరేంద్రమోదీ పట్ల నమ్మకంతో ప్రజలంతా ఓటు బ్యాంకుగా మారి ఓటేసిన ఓటర్ మహాశయులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ లో ఓడిపోతాననే ఆక్రోశంతో అధికార పార్టీ నేతలు అక్కడక్కడా సిబ్బందిపై దుర్భాషలాడినా, కార్యకర్తలపై దాడులు జరిపించేందుకు యత్నించినా మా కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించారన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని, ప్రజాస్వామ్య స్పూర్తిని కాపాడాలన్నదే లక్ష్యంగా పనిచేశామన్నారు. ఎగ్జిట్ పోల్స్ పై ఎవరి అభిప్రాయాలు వారివని, గతంలో దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ తారుమారయ్యాయని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ సీట్లు వస్తాయనే నమ్మకం ఉందన్నారు. డిసెంబర్ 3న వాస్తవ ఫలితాలు వస్తాయని, ఫలితాలు వెలువడ్డాక ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని జాతీయ నాయకత్వం తదుపరి నిర్ణయం తీసుకుంటుందన్నారు. బీజేపీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందను, పేదల ఇండ్లను కబ్జా చేసేటోళ్లను, దౌర్జన్యం చేసేవాళ్లపై తప్పకుండా చర్యలుంటాయన్నారు. ప్రజలకు అండగా ఉంటానని, కరీంనగర్ లో ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పి స్పూర్తిదాయకమైన వాతావరణాన్ని కొనసాగిస్తామన్నారు.