మీ బిడ్డగా ఒక్క అవకాశం ఇవ్వండి: కాంగ్రెస్ అభ్యర్ధి ప్రణవ్

తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే….
. మీ బిడ్డగా ఒక్క అవకాశం ఇవ్వండి..
. ప్రతి కుటుంబానికి అండగా ఉంటా…
. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్

హుజురాబాద్:
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, మీ బిడ్డగా ఒక్క అవకాశం ఇచ్చి మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్ కోరారు. శుక్రవారం హుజూరాబాద్ మండలంలోని బోర్నపల్లిలో ప్రచారాన్ని నిర్వహించారు. ప్రణవ్ బాబుకు మంగళ హారతులు, డప్పుచప్పుళ్లు, కోలాటాలు, నృత్యాలు చేస్తూ గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేను మీలో ఒక్కడిని మీ ఇంట్లో కొడుకు లాగా ఆదరించాలని మీతో పాటు మీ కష్టసుఖాలలో పాలుపంచుకుంటానన్నారు. బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలపాటు రాష్ట్రాన్ని పాలించి ప్రజలకు చేసిందేమి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రూపొందించిన తర్వాత మేము నిర్ణయించిన రూ.500 గ్యాస్ సిలిండర్ ధరను రూ.400 కి ఇస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. గత పదెల్లుగా అధికారంలో ఉన్నప్పుడు రూ.400కు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి హుజురాబాద్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి బహుమతిగా ఇవ్వాలన్నారు. మాటిచ్చి నెరవేర్చే తత్వం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంటుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే ప్రతి పథకాన్ని మీ ఇంటికి చేర్చేబాధ్యత తీసుకుంటానని మాట ఇచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట వేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని, 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు అందిస్తామన్నారు. అర్హులైన వారికి ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి ఐదు లక్షలు అందిస్తామని హామీ ఇచ్చారు. యువతీ, యువకులకు చదువుకోవడానికి 5 లక్షల రూపాయల యువ వికాసం పథకాన్ని రూపొందించమని ఆయన పేర్కొన్నారు.

హుజురాబాద్ గడ్డమీద ఎగిరేది కాంగ్రెస్ జెండానే…
హుజురాబాద్ గడ్డమీద ఎగిరేది కాంగ్రెస్ జెండానేనని ఆయన అన్నారు. యువకుల ఉన్నత చదువుల కోసం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఏ ఒక్క మండలంలో స్టడీ సెంటర్ లేదని, నియోజకవర్గంలోని ప్రతి మండలానికి స్టడీ సెంటర్, డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఏడుసార్లు హుజురాబాద్ నియోజకవర్గం నుండి గెలుపొందిన వ్యక్తి ఈ ప్రాంతానికి చేసింది ఏమీ లేదన్నారు. మళ్లీ మూడేళ్ల క్రితం వచ్చి నన్ను చంపుకుంటారో.. సాదుకుంటారో… అంటే అవకాశం ఇచ్చినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక్క రూపాయి నిధులను సైతం తీసుకురాలేదన్నారు. కనీసం ఆయన సొంత మండలంలోని ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని సైతం పూర్తి చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తోట రాజేంద్రప్రసాద్, హుజరాబాద్ పట్టణ అధ్యక్షుడు సొల్లు బాబు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పుష్పలత, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గూడూరు స్వామిరెడ్డి, కే శీను, నరేష్, సూర్య కిరణ్, సందమల్ల బాబు తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.