మీ తీర్పు కోసం యావత్ తెలంగాణ ఎదురుచూస్తోంది:బండి

నిరుద్యోగ యువకులారా… బీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పండి
. మీవి భూకబ్జాల భాగోతం… నాది పోరాటాల చరిత్ర
. కరీంనగర్ ప్రజలారా… ఎటువైపు ఉంటారో ఆలోచించండి
. మీ తీర్పు కోసం యావత్ తెలంగాణ ఎదురుచూస్తోంది
. కరీంనగర్ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కమార్

కరీంనగర్:
నిరుద్యోగులను మోసం చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని కరీంనగర్ బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం కరీంనగర్ పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యోగాలెందుకివ్వడం లేదని నిరుద్యోగులు నిరసన తెలిపితే వారిని కెటిఆర్ దూషించడం పట్ల మండిపడ్డారు. రాష్ట్రంలోని యువకులంతా బిఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. వంద గదులతో ప్రగతి భవన్ కట్టుకున్న కేసీఆర్.. నిరుపేదలకు మాత్రం ఇండ్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కెసిఆర్ కుటుంబ సభ్యులందరికీ రాజకీయ ఉద్యోగాలు ఇచ్చుకున్నారు..కానీ ఇంటికొక ఉద్యోగమైనా ఎందుకివ్వలే? కనీసం నిరుద్యోగ మృతి ఇస్తానని ఎందుకివ్వలేదని అడిగారు. నిరుద్యోగుల పక్షాన కొట్లాడితే నాపై 74 కేసులు పెట్టి జైలుకు పంపారని ఆవేదన వ్యక్తంచేశారు. అవినీతిపరుడాన్ని ఆస్తులు సంపాదించానని నాపై ఆరోపణలు చేస్తున్న మంత్రి గంగుల నాతో పాటు తన ఆస్తులను ప్రజలకు ఇచ్చేందుకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్ధులిద్దరిదీ భూకబ్జాల భాగోతం…నాది పోరాటాల చరిత్ర.. ఎటువైపు ఉంటారో ప్రజలు ఆలోచించి ఓటేయాలని కోరారు.