లెక్కింపు ముగిసే వరకు కౌంటింగ్ కేంద్రం నుండి వెళ్లొద్దు :సిఆర్ ప్రసన్న కుమార్

ఓట్లలెక్కింపు ముగిసే వరకు కౌంటింగ్ కేంద్రాన్ని వదిలి వెళ్లొద్దు
. కౌంటింగ్ అబ్జర్వర్ సిఆర్ ప్రసన్న కుమార్

కరీంనగర్:
ఓట్ల లెక్కంపులో ఉండే సిబ్బంది ఎవరుకూడా లెక్కంపు ముగిసే వరకు కౌంటింగ్ కేంద్రాన్ని వదిలి వెళ్లకూడదని కౌటింగ్ ఆబ్జర్వ్ సిఆర్ ప్రసన్న కుమార్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో అసెంబ్లీ ఎన్నిల కౌంటింగ్ లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అకౌంటింగ్ సూపర్ వైజర్లు, మైక్రో అబ్జర్వర్లు, మాస్టర్ ట్రైనర్లు, కౌంటింగ్ అబ్జర్వర్లు సిఆర్ ప్రసన్న, ఎస్ జె చౌడ, మనిష్ కుమార్ లోహన్ పాల్గోన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు. కౌంటింగ్ హాల్లో మైక్రో అబ్జర్వర్లు ఉదయం 6గం. లకు హజరు కావాలని తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోని సెల్ ఫోన్ వంటి పరికరాలను తీసుకువెళ్లకూడదన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ ను ఏ విధంగా విజయవంతం చేశారో.. అదే విధంగా కౌంటింగ్ ను కూడా విజయవంతం చేయాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ లను మొదటగా లెక్కించాలని, ఆనంతరం ఈవియం లోని ఓట్లను లెక్కించాలన్నారు. లెక్కింపులో సమస్యలు తలెత్తకుండా చూడాలని, ఏవైనా సమస్యలు ఎదురైనట్లయితే వెంటనే రిటర్నింగ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ఎస్ఆర్ఆర్ కళాశాలలో కౌంటింగ్ ముగిసే వరకు సిబ్బంది ఎవరు కౌంటింగ్ కేంద్రాన్ని వదిలివెళ్లకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డిప్యూటి కలెక్టర్ సదానందం, మార్కెటింగ్ అధికారి పద్మావతి, ఎల్డియం ఆంజనేయులు, డిఈఓ జనార్దన్ రావు తదితరులు పాల్గోన్నారు.