అభివృద్ధి చేయకుంటే మళ్లీ ఓటు అడగ: బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి

సంక్షేమం కావాలా.. సంక్షోభం కావాలా..
. 5 గంటల కరెంట్ కావాలా… 24 గంటల కరెంట్ ఇచ్చే బిఆర్ఎస్ కావాలా…
. అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేయకుంటే మళ్లీ ఓటు అడగను
. బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి

హుజురాబాద్:
ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ కావాలా.. లేక సంక్షోభం సృష్టించే పార్టీలు కావాలా ప్రజలే ఆలోచించుకోవాలని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అన్నారు. ఆదివారం హుజురాబాద్ మండలంలోని ఇందిరానగర్ లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇచ్చి హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని దీమ వ్యక్తం చేశారు. ఒకవేళ అభివృద్ధి చేయకపోతే మరోసారి ఓటు అడగనని అన్నారు. దళిత బందు పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ ను ఎంపిక చేసి దళిత కుటుంబాల అభివృద్ధికి 10 లక్షల రూపాయలు కేటాయించి వారి వారి కుటుంబాల్లో వెలుగు నింపిన మహనీయుడు కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత రైతుల కోసం 24 గంటల ఉచిత కరెంటుతో పాటు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాల అమలు చేసి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు పూర్తి న్యాయం చేశారన్నారు. సిఎం కెసిఆర్ పేద ప్రజల కోసం కొత్త మేనిఫెస్టో తయారు చేశారన్నారు. మేనిఫెస్టోలో ముఖ్యంగా సౌభాగ్య లక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.3వేలు అందించనున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి 15 లక్షల పెంచామని, గ్యాస్ సిలిండర్ ను కూడా కేవలం 400 కి అందిస్తామన్నారు. దీంతోపాటు కేసీఆర్ ధీమా ఇంటింటికి బీమా అని రేషన్ కార్డుదారులందరికి ఐదు లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. గత 15 ఏళ్లుగా హుజురాబాద్ నియోజకవర్గంలోనే ప్రజల మధ్య గడుపుతున్నానని, వారికి ఏ ఆపద వచ్చినా అన్న అంటే నేనున్నా అంటూ నా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని దండం పెట్టి అడుగుతున్న 15 సంవత్సరాల నా కష్టాన్ని గుర్తించండని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
బిఆర్ఎస్ లో చేరిన బిజెపి నాయకులు..
నియోజకవర్గం లోని వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి బిజెపి నాయకులు, కార్యకర్తలు ఆదివారం స్థానిక బిఆర్ఎస్ కార్యాలయంలో బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కెసిఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరడం గర్వంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బిఆర్ఎస్ తో మాత్రమే జరుగుతుందన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అందరూ కష్టపడి బిఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎప్పుడు ఏ ఆపద వచ్చిన మీ అందరికీ నేనున్నానంటూ హామీ ఇచ్చారు.