రెడ్ క్రాస్ సొసైటీకి అండగా ఉంటా…

0

ప్రాణదాత రెడ్ క్రాస్ కు అండగా ఉంటా…
. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ:
ఆపదలో ఉన్నవారికి రక్తాన్ని అందించి ప్రాణాలు కాపాడే ప్రాణదాత రెడ్ క్రాస్ కు ఎల్లవేళలా అండగా ఉంటానని వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ ప్రాంగణంలో తల సేమియా బాధితుల కోసం తలసీమియా సెంటర్ పైన మొదటి అంతస్తు నిర్మాణం కొరకు పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మొదటిసారిగా నిర్వహించే అధికారిక ప్రారంభోత్సవ కార్యక్రమం రెడ్ క్రాస్ తల సేమియా భవనం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రక్తదానమే కాకుండా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రెడ్ క్రాస్ అభ్యున్నతికి ప్రభుత్వపరంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రాష్ట్రంలోనే ఉత్తమ రెడ్ క్రాస్ గా హనుమకొండ శాఖను నిలిపిన పాలకవర్గాన్ని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ రెడ్ క్రాస్ ప్యాట్రన్ ఎర్రబెల్లి స్వర్ణ, హనుమకొండ రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ పి. విజయచందర్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ది వెంకటనారాయణ గౌడ్, కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఈవి శ్రీనివాస్ రావు, జిల్లా పాలకవర్గ సభ్యులు పుల్లూరి వేణు గోపాల్, డాక్టర్ యం. శేషుమాదవ్, పొట్లపల్లి శ్రీనివాస్ రావు, డాక్టర్ కె. సుధాకర్ రెడ్డి, చెన్నమనేని జయశ్రీ, బిళ్ళ రమణారెడ్డి, బాశెట్టి హరిప్రసాద్, భూపాలపెల్లి రెడ్ క్రాస్ రాష్ట్ర పాలకవర్గ సభ్యులు బొద్దిరెడ్డి సతీష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ గుజ్జుల వసంత మహేందర్ రెడ్డి, మరియు జీవితకాల సభ్యులు, రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *