టిడిపి నాయకుని కుటుంబాన్ని పరామర్శించిన సీతక్క
గుర్రం వెంకటేశ్వర్లు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సీతక్క
హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు గుర్రం వెంకటేశ్వర్లు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా ఆయన కుటుంబాన్ని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పరామర్శించారు. సోమవారం హుజరాబాద్ పట్టణంలో వెంకటేశ్వర్లు కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గతంలో టీడీపీ పార్టీలో గుర్రం వెంకటేశ్వర్లు తో పని చేసిన అనుభవాన్ని గుర్తు చేశారు. వారి కుటుంబ సభ్యులతో పాటు కుమారులు గుర్రం హరిబాబు, గుర్రం కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.