పెట్టబడి దారి వ్యవస్థను నిర్మూలించేది కమ్యూనిస్టులే..
పెట్టబడి దారి వ్యవస్థను నిర్మూలించేది కమ్యూనిస్టులే..
. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి
హసన్ పర్తి:
పెట్టబడి దారి వ్యవస్థను నిర్మూలించేది కమ్యూనిస్టులేనని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ 99 వ వార్షికోత్సవాల సభ హసన్ పర్తి మండలం ఎల్లాపూర్ గ్రామంలో మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా నేదునూరి జ్యోతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమం మండల పార్టీ కార్యదర్శి మెట్టు శ్యామ్ సుందర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ హక్కుల రాష్ట్ర నాయకులు నేదునూరి రాజమౌళి, బికేఎంయు జాతీయ నాయకులు మోతే లింగారెడ్డి, ఆటో యూనియన్ నాయకులు రేణిగుంట్ల దుర్గాప్రసాద్, చిరంజీవి, సీనియర్ నాయకులు గోపరాజు భద్రయ్య, బిఎస్ఎన్ నాయకులు సాంబయ్య, సింగరేణి కార్మికులు రజాక్ రైతు సంఘం నాయకులు గోపు బుచ్చిరెడ్డి, అజయ్, లక్ష్మయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.