అభివృద్ధి జరిగేలా చూడాలి
మత్స్య సంపద అభివృద్ధి జరిగేలా చూడాలి
. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్:
అధిక పోషక విలువలు ఉండే చేపల ఉత్పత్తి జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన మరియు రాష్ట్ర ప్రణాళిక పథకంలో భాగంగా ఉచిత చేప పిల్లల పంపిణీ సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడారు. మత్స్య సంపద అభివృద్ధి జరిగేలా చూడాలని, జిల్లాలో అధిక పోషకాలు ఉండే చేపలు ఆహారంగా తీసుకునేలా చూడాలని, మొబైల్ ఫిష్ అవుట్ లెట్ క్యాంటీన్లను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి దేవేందర్, ఎల్డియం ఆంజనేయులు, నాబార్డ్ అధికారి జయప్రకాశ్, తదితరులు పాల్గోన్నారు.