కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాజేందర్ రావు ను గెలిపించండి

1


– ఎస్సి సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాస్
కరీంనగర్:
కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచెర్ల రాజేందర్రావు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాస్ కోరారు. శనివారం కొత్తపల్లి మండలం చింతకుంటలో శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఇంటింటికి వివరించారు. కరీంనగర్ నియోజకవర్గ అభివృద్దికి కృషిచేసిన మాజీ ఎంఎల్ఏ దివంగత వెలిచాల జగపతిరావు తనయుడు వెలిచాల రాజేందర్ రావు తండ్రి బాటలోనే ప్రజలకు సేవ చేసేందుకు వచ్చాడన్నారు. కాంగ్రెస్ పార్టీ తోనే అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందన్నారు. ఎంపీ ఎన్నికల్లో రాజేందర్ రావును గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు తిరుమల, రమేష్, రాజు, పోచన్న తదితరులు పాల్గొన్నారు.

1 thought on “కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాజేందర్ రావు ను గెలిపించండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *