ముందస్తు క్రిస్మస్ వేడుకలు

0

శ్రీ కాకతీయ పాఠశాలలో ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు

హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలో శ్రీ చైతన్య కరికులం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ కాకతీయ పాఠశాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం పాఠశాల ఆవరణలో ఏసుక్రీస్తు పాకను ఏర్పాటు చేశారు. అలాగే కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించారు. అనంతరం చిన్నారులు క్రిస్మస్ తాత వేషధారణలతో అందరినీ అలరించారు. చాక్లెట్లు పంచి పెట్టారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మాట్ల సందీప్ కుమార్ మాట్లాడుతూ… క్రీస్మస్ ప్రాముఖ్యతను, ఏసుక్రీస్తు గొప్పతనాన్ని, జననం గురించి విధ్యార్థులకు వివరించారు. చిన్నారులు ప్రదర్శించిన నాటికలు, నృత్యాలు, వివిధ వేషధారణలు, రకరకాల బొమ్మలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య, ఏజీఎం రాజు, ఏజడ్ఏసి ప్రవీణ్, డీన్ మంద శ్రీనివాస్, ప్రైమరీ ప్రీ ప్రైమరీ ఇంచార్జులు తిరుమల, స్రవంతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *